మరోసారి రాహుల్‌పై పోటీకి స్మృతి ఇరానీ

|

Mar 21, 2019 | 9:11 PM

ఢిల్లీ: కొద్ది సేపటి క్రితమే బీజేపీ అధిస్ఠానం 184 మందితో కూడిన తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.   ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై బీజేపీ సీనియర్ లీడర్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రెండో సారి పోటీ చేయబోతున్నారు. కొన్ని దశాబ్ధాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న  ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నియోజకవర్గం నుంచి వీరిద్దరు పోటీ చేయనున్నారు. కాగా  2014 ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీపై స్మతి ఇరానీ పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు. కాకపోతే రాహుల్‌కి ఉన్న […]

మరోసారి రాహుల్‌పై పోటీకి స్మృతి ఇరానీ
Follow us on

ఢిల్లీ: కొద్ది సేపటి క్రితమే బీజేపీ అధిస్ఠానం 184 మందితో కూడిన తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.   ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై బీజేపీ సీనియర్ లీడర్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రెండో సారి పోటీ చేయబోతున్నారు. కొన్ని దశాబ్ధాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న  ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నియోజకవర్గం నుంచి వీరిద్దరు పోటీ చేయనున్నారు. కాగా  2014 ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీపై స్మతి ఇరానీ పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు. కాకపోతే రాహుల్‌కి ఉన్న మెజార్టీని తగ్గించగలిగారు.  రాహుల్‌కి సరైన పోటీ సృతి అని భావించే బీజేపీ అధిస్ఠానం స్మృతి ఇరానీని బరిలోరి దించినట్టు తెలుస్తుంది . మరి ఈ సారి పోరు ఎంత హోరాహోరిగా ఉంటుందో చూాడాలి.