జగన్‌ వ్యాఖ్యలపై దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ: 4గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం హాట్ హాట్‌గా జరుగుతోంది. మాజీ సీఎం చంద్రబాబు పట్ల సీఎం జగన్.. చేసిన వ్యాఖ్యలతో సభ పెద్ద ఎత్తున దద్దరిల్లింది. తమ అధినేతపై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తూ.. టీడీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. చంద్రబాబును క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. దీంతో.. సభకు ఆటంకం కల్గిస్తున్నారని .. నలుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్‌ చేశారు. అశోఖ్ […]

జగన్‌ వ్యాఖ్యలపై దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ: 4గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Updated on: Jul 25, 2019 | 4:02 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం హాట్ హాట్‌గా జరుగుతోంది. మాజీ సీఎం చంద్రబాబు పట్ల సీఎం జగన్.. చేసిన వ్యాఖ్యలతో సభ పెద్ద ఎత్తున దద్దరిల్లింది. తమ అధినేతపై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తూ.. టీడీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. చంద్రబాబును క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. దీంతో.. సభకు ఆటంకం కల్గిస్తున్నారని .. నలుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్‌ చేశారు. అశోఖ్ బెందాళం, గణేష్, రామకృష్ణ, వీరాంజనేయులు సస్పెండ్ అయ్యారు. ఈ రోజు సభ ముగిసే వరకు.. ఈ నలుగురు సభ్యులు సస్పెండ్ అయ్యారు.

Loading...
Unable to load recommendations.
Follow Us