జోగులాంబ అమ్మవారి సన్నిధిలో సీఎం కేసీఆర్‌ కుటుంబం.. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు

|

Feb 16, 2021 | 1:34 PM

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబం వరుస అధ్యాత్మిక పర్యటనల్లో బిజీగా ఉంటుంది. మొన్న వారణాసిలో కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌ ఫ్యామిలీ తాజాగా..

జోగులాంబ అమ్మవారి సన్నిధిలో సీఎం కేసీఆర్‌ కుటుంబం.. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు
Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబం వరుస అధ్యాత్మిక పర్యటనల్లో బిజీగా ఉంటుంది. మొన్న వారణాసిలో కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌ ఫ్యామిలీ తాజాగా గద్వాల జిల్లాలోని జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి ఆలయాలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి గ్రూప్ దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, ఇతర కుటుంబ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు అబ్రహం, వెంకటేశ్వర్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.

 

Read more:

వైయస్‌ షర్మిల తెలంగాణ బిడ్డే.. రాష్ట్రం విడిపోయాక ఇక పంచాయతీ ఎందుకన్న మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి