ఎన్నికల్లో బ్రెయిలీ విధానం అమలు

న్యూఢిల్లీః అంధుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేకంగా ఎన్నికల్లోనూ బ్రెయిలీ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా మేఘాలయలో అమలు చేయాలని భావిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని 800 మంది అంధులు తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి ఖర్కోగోర్‌ తెలిపారు. ఈవీఎంలపై బ్రెయిలీ లిపిలో ఉన్న బ్యాలెట్ పత్రాలు అంటించనున్నట్టు ఖర్కోగోర్ పేర్కొన్నారు. అంధులు వీటిని గుర్తించే అవకాశం ఉండడంతో వారు […]

ఎన్నికల్లో బ్రెయిలీ విధానం అమలు

Updated on: Mar 30, 2019 | 10:00 PM

న్యూఢిల్లీః అంధుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేకంగా ఎన్నికల్లోనూ బ్రెయిలీ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా మేఘాలయలో అమలు చేయాలని భావిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని 800 మంది అంధులు తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి ఖర్కోగోర్‌ తెలిపారు.

ఈవీఎంలపై బ్రెయిలీ లిపిలో ఉన్న బ్యాలెట్ పత్రాలు అంటించనున్నట్టు ఖర్కోగోర్ పేర్కొన్నారు. అంధులు వీటిని గుర్తించే అవకాశం ఉండడంతో వారు ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా ఓటు వేయగలుగుతారని ఆయన వివరించారు. మున్ముందు ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది.

Follow Us