శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల శివుడిని ఆరాధించడం, ఉపవాసం చేయడం వల్ల అద్భుత ఫలితాలు లభిస్తాయి. శ్రావణ మాసంలో సోమవారం నాడు ఈ వస్తువులను దానం చేయడం ఉత్తమం.
శ్రావణంలో బియ్యం, భోజనం దానం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. శివపురాణం ప్రకారం, శ్రావణ సోమవారం ఆరాధనలో ఒక పిడికెడు అక్షతలు శివలింగానికి సమర్పించండి. అవసరమైన వారికి అన్నదానం, బియ్యం దానం చేయండి. ఇది పురోగతికి మార్గం వేస్తుంది.
నల్ల నువ్వులు - నల్ల నువ్వులు శివుడు, శనిదేవుడికి ఇద్దరికీ ఇష్టమైనవి. శ్రావణ సోమవారాలు లేదా శ్రావణ శనివారాలలో నల్ల నువ్వులను దానం చేయడం వలన ఏళ్లనాటి శని దుష్ప్రభావాలు తగ్గుతాయి. రాహు-కేతు జన్మ దోషాలు కూడా దూరమవుతాయి.
ఉప్పు - శివపురాణం ప్రకారం, ఉప్పును దానం చేయడం వల్ల చెడు సమయాలు తొలగిపోతాయి. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వస్తుంది. గ్రంథాలలో, ఉప్పు సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది.
శివుని మరొక ముఖ్యమైన అంశం రుద్రాక్ష. ఇది శివుని కన్నీటితో సృషించబడిన రుద్రాక్షను శ్రావణ మాసంలో ధరించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఎవరిపై గ్రహాల దుష్ప్రభావాలు ఉంటాయో ..వాటి నుంచి రక్షణ కవచంగా పనిచేయడమే కాదు.. అపారమైన శాంతి, సామరస్యం పెంపొందించడంలో సహాయపడుతుంది. కుటుంబం, ఉద్యోగ సంబంధాలను సమతుల్యం చేయడానికి 'దో ముఖి' రుద్రాక్షను, వివాహ అవకాశాలను మెరుగుపరచడానికి గౌరీ శంకర రుద్రాక్షను ధరించవచ్చు. పంచ ముఖి రుద్రాక్ష విస్తృతంగా అందుబాటులో ఉంది. ఈ రుద్రాక్షలను రోజువారీ ప్రార్ధన కోసం ఉపయోగిస్తారు.
వెండి - సంతానం పొందడానికి, కాల సర్ప దోషం నుండి బయటపడటానికి, శ్రావణ మాసంలో వెండి వస్తువులను దానం చేయండి.