పళ్లను పసుపు రంగులోకి మార్చే అనేక రకాల మసాలా దినుసులను ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు. దీన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలని సూచించారు. పళ్లు తోముకున్న తర్వాత కూడా చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.
చాలా మంది పసుపు దంతాలు, పంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ.. దంతవైద్యుడిని సంప్రదిస్తుంటారు. మందులతో దంతాలను శుభ్రం చేయించుకుంటారు.. అయితే అది పదే పదే చేయడం సాధ్యం కాదు. పసుపు దంతాలను వదిలించుకోవడానికి కొన్ని సులభమైన ఇంటి నివారణలను ఉపయోగించవచ్చు.
బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించవచ్చు. 1 టీస్పూన్ బేకింగ్ సోడాను 2 టీస్పూన్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ కలపండి. ఈ పేస్ట్తో బ్రష్ చేసిన తర్వాత మీ దంతాలు తెల్లగా మారుతాయి.
యాపిల్ సైడర్ వెనిగర్ పసుపు దంతాలను ప్రకాశవంతంగా మార్చడానికి ఉపయోగించవచ్చు. 1 కప్పు నీటిలో 2 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపడం ద్వారా మౌత్ వాష్ చేయండి. ఈ ద్రావణాన్ని నోటి లోపల 30 సెకన్ల పాటు స్విష్ చేయండి. తర్వాత నీళ్లతో కడిగి బ్రష్ చేసుకోవాలి. దీన్ని అతిగా వాడకూడదు.
నిమ్మ, నారింజ, అరటి తొక్కలు కూడా దంతాల పసుపు రంగును తొలగిస్తాయి. ఈ తొక్కలను దంతాల మీద రుద్దితే పసుపు రంగు పోతుంది. ఈ పండు తొక్కను మీ దంతాల మీద 2 నిమిషాల పాటు సున్నితంగా రుద్దండి. కొంత సమయం తర్వాత బ్రష్ చేయండి.