
మధ్యప్రదేశ్లోని మందసౌర్లో ఉన్న ప్రసిద్ధ పశుపతి నాథ్ మహాదేవ్ ఆలయంలో సహస్త్రేశ్వర్ మహాదేవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివలింగాన్ని జలధారి అంటే.. నీటితో ప్రతిష్టించాల్సి ఉంది.. ఇందుకోసం ఓ భారీ క్రేన్ సహాయం కూడా తీసుకున్నారు.

నివేదికల ప్రకారం.. ఈ పనికోసం పీడబ్ల్యూడీ, పీహెచ్ఇ జిల్లా పంచాయితీతో సహా అన్ని శాఖల ఇంజనీర్లు రంగంలోకి దిగారు. అయితే జిలహారిపై శివలింగాన్ని ఎలా ప్రతిష్టించాలనేది అందరి ముందు పెద్ద సవాలుగా మారింది. ఇందుకు ఇంజనీర్లు సైతం సరైన పరిష్కారం కనిపెట్టలేకపోయారు. కానీ ఈ సమస్యకు ఓ ముస్లిం వ్యక్తి విగ్రహాన్ని ప్రతిష్టించే బాధ్యతను తీసుకున్నాడు.

ఆ శివలింగం సహస్త్రేశ్వర్ రూపం చాలా ప్రత్యేకం. దీని పొడవు.6.50 అడుగులు. బరువు రెండున్నర టన్నులు. ఈ శివలింగం ఏర్పాటు వెనక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ శివలింగం ప్రతిష్టించేందుకు ఇంజనీర్లు చాలా విధాలుగా ప్రయత్నించారు. అయితే ఇంజనీర్లు పాట్లు.. అక్కడే ఉన్న మక్బుల్ అనే వ్యక్తి చూస్తూనే ఉన్నాడు. ఆక్కడ అతను తాపీ మేస్త్రీ, కూలీ పని చేస్తున్నాడు.

అధికారులు.. ఇంజనీర్లు ఇబ్బందిపడడం చూసిన మక్బూల్ శివలింగాన్ని ప్రతిష్టించేందుకు మార్గాన్ని చూపించాడు. దీంతో అక్కడున్నవారంత షాక్ అయ్యారు. ఎందుకంటే మక్బూల్ ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. అతనికి చదువు రాదు. కానీ తన పని అనుభవం ఆధారంగా ఆ సమస్యను పరిష్కరించాడు.

జిలహారీలో శివలింగాన్ని ప్రతిష్టించే ప్రదేశంలో ఒక ఐస్ ను ఉంచితే జిలహారీకి ఎలాంటి హాని ఉండదని.. శివలింగాన్ని కూడా సురక్షితంగా ప్రతిష్టించవచ్చని మక్బూల్ చెప్పాడు. మంచు కరగడంతో స్వామివారి శివలింగం జిలహారిలోకి ప్రవేశించి ప్రతిష్టించనుంది.. అని సూచించాడు.

దీంతో అల్లా.. దేవుడు ఇద్దరూ ఒక్కటే అని మక్భూల్ చెప్పాడు.. ఈ ప్రతిష్టాత్మకమైన పనిలో తనవంతు సహాయం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్, కలెక్టర్ గౌతమ్ సింగ్ మాట్లాడుతూ జిల్హారీలో శివలింగాన్ని స్థాపించడానికి చాలా కృషి చేయాల్సి ఉందని చెప్పారు. ఇంజనీర్లు ఎంతో ట్రై చేశారు. కానీ మక్బూల్ భాయ్ దానిని సులభం చేసాడు అని చెప్పుకొచ్చారు.