
నేటి బిజీగా జీవనశైలిలో చాలా మందికి ఆహారంపై తగిన శ్రద్ధ ఉండటం లేదు. దీంతో రోజులో మూడు పూటలు అన్నం తింటున్నారు. అందుకు మరో కారణం కూడా ఉంది. అన్నం త్వరగా తయారవుతుంది. జీర్ణం కావడం సులభం. పైగా చాలా మందికి అన్నం తినకపోతే కడుపు నిండినట్లు అనిపించదు. అయితే రాత్రిపూట అన్నం తినడం అనారోగ్యకరమైన అలవాటని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బరువు పెరగడం.. బియ్యంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల శరీరం అధికంగా కేలరీలను గ్రహిస్తుంది. రాత్రిపూట శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది కాబట్టి, ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల ఈ కేలరీలు శరీరంలో కొవ్వుగా నిల్వ అవుతాయి. నిద్రపోతున్నప్పుడు శరీర జీవక్రియ నెమ్మదిస్తుంది. దీని కారణంగా కేలరీలు బర్న్ చేయబడవు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

రక్తంలో చక్కెరను పెరుగుదల.. బియ్యం అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. దీని కారణంగా అన్న తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. రాత్రి నిద్రకు ముందు అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. డయాబెటిస్ లేదా ఇన్సులిన్ లోపం ఉన్నవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.

అజీర్ణం.. కొంతమందికి రాత్రిపూట అన్నం తిన్న తర్వాత ఉబ్బరం లేదా జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. జీర్ణక్రియ సరిగా లేని వారికి గుండెల్లో మంట, గ్యాస్, అజీర్ణం వంటివి ఎదురవుతాయి.

రాత్రిపూట అన్నానికి బదులుగా మల్టీగ్రెయిన్ చపాతీలు తినవచ్చు. ప్రోటీన్ అధికంగా ఉండే చిరు ధాన్యాలు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. మిల్లెట్లు జీర్ణం కావడం కూడా సులభం. వీటిల్లో బియ్యం కంటే తక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది.