
గత కొన్ని దశాబ్దాల క్రితం వరకూ దేశంలో అత్యంత సంపన్నులతో కార్లు ముడిపడి ఉండేవి. నేడు భారతదేశంలోని పెద్ద నగరాల్లో మాత్రమే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లమీద అనేక కార్లు తిరుగుతూ కనిపిస్తాయి.

అయితే భారతదేశంలో మొదటి కారు ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కాదు అప్పట్లో అత్యంత ధనవంతులున్న నగరంలో మొదటిసారిగా కారు అడుగు పెట్టింది.

చాలా మంది దేశంలోని అత్యంత ధనవంతులు ఢిల్లీ ముంబైలో నివసిస్తున్నారని భావిస్తారు. కానీ మనకు స్వాతంత్య్రం రాక పూర్వం అంటే 1897 కాలంలో దేశంలోని ధనిక నగరాల్లో ఒకటి కోల్కాతా.

ఈ సమయంలో కోల్కాతా భారతదేశంలోని ఒక ప్రముఖ నగరం. ముఖ్యంగా కళలకు ప్రసిద్ధి చెందింది. అందుకే అప్పట్లో కోల్కాతాలో చాలా మంది ధనవంతులు ఉండేవారు. దేశంలోనే తొలి కారు కూడా ఈ నగరానికే వచ్చింది.

ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం భారతదేశంలో మొదటి కారు 1987లో కొనుగోలు చేయబడింది. ఈ కారు ఫ్రెంచ్ డిడియన్. క్రాంప్టన్ గ్రీవ్స్ కంపెనీకి సంబంధించిన మిస్టర్ ఫోస్టర్ ఈ కారును కొనుగోలు చేశారు.

1986లో ఒక ప్రకటనను రూపొందించడానికి కోల్కతా వీధుల్లో మొదటిసారిగా కారు నడుస్తున్నట్లు కనిపించింది. కలకత్తా ప్రజలు ఆ కారు ప్రకటనను చూడడానికి ఆసక్తిని కనబరిచారు. యాడ్ షూట్ చేస్తుంటే కారు చూడడం కోసం భారీ సంఖ్యలో జనం గుమిగూడారు.

భారతదేశంలో మొట్టమొదటి కారు కోల్కతా నగరంలో కనిపించిన కనిపించింది. అయితే మొదటిసారిగా కారు కొన్న తొలి భారతీయుడు ఎవరో తెలుసా? అతను టాటా గ్రూప్ స్థాపకులు జామ్సెట్జీ టాటా.

టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్సెట్జీ టాటా ఈ కారును 1898లో కొనుగోలు చేశారు. అయితే టాటా కారు కొనుగోలు చేసినప్పుడు అదే సమయంలో ముంబై నగరంలోని రోడ్ల మీద మూడు కార్లు షికారు చేశాయి. అయితే ఆ మూడు కార్లను కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా పార్సీ వర్గానికి చెందినవారు.