
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వేడి నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం, మార్చి, మే మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ, యూపీ, బీహార్, జార్ఖండ్ వంటి ఈ రాష్ట్రాల్లో వాతావరణం ప్రారంభంలో చాలా వేడిగా ఉంటుంది.

వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ, ఈ సంవత్సరం మార్చి, మే మధ్య ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మార్చి నెల రెండో వారం తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

మార్చి నెలలో ఉత్తర, మధ్య భారతదేశంలో వేడిగాలులు వీచే అవకాశం తక్కువగా ఉందన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తక్కువగా ఉండడంతో రుతుపవనాలు సకాలంలో వస్తాయని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

సాధారణంగా, దేశంలోని అనేక రాష్ట్రాల్లో, మే నెల నుండి తీవ్రమైన వేడి మొదలవుతుంది. కానీ, ఈ సారి ముందుగానే భానుడు ప్రతాపం చూపించనున్నాడు. మార్చి 15 తర్వాత ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మార్చి చివరి వారంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

మార్చి ప్రారంభంలో, మహారాష్ట్రతో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్కు దగ్గరగా ఉంటుంది. ఏప్రిల్ మొదటి వారంలో ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. ఈ నెలలో కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగా ఉండే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది.

ఈసారి రుతుపవనాలు సకాలంలో వస్తాయని, సాధారణంగానే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత ఎల్నినో జూన్లో బలహీనపడుతుంది. దీని తరువాత, జూలై, ఆగస్టులో ఎల్నినో పరిస్థితులు తలెత్తవచ్చు. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది రుతుపవనాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.