

India Covid Vaccine

సెలవు దినాల్లోనూ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను కొనసాగించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు పంపింది. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించిన గణాంకాల మేరకు దేశంలో ప్రస్తుతం 5,52,566 యాక్టివ్ కోవిడ్ కేసులుండగా...1,14,34,301 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. 1,62,468 మంది కరోనా బారినపడి మృత్యువాతపడ్డారు. మొదటి దఫా వ్యాక్సినేషన్ ప్రక్రియను జనవరి 16న ప్రారంభించగా... ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 6,30,54,353 మందికి కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చారు.