
పల్లెటూర్లలో జనాలు ఉదయం లేవగానే అన్నం, కూర వండుకుని బాక్స్ లో కట్టుకుని వెళ్తారు. ఇంకొందరు పొలం పచ్చడిని చేసుకుని ఎంచక్కా చెట్ల కింద కూర్చొని తింటారు. అయితే, ఈ పేదోళ్ళ పొలం పచ్చడి తింటే అమృతమే. దీని కోసం ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. దీనిని అప్పటికప్పుడు చేసేయోచ్చు

కావలసిన పదార్థాలు : పావు కిలో దొండకాయలు, 100 గ్రాములు పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, – చిన్న నిమ్మకాయంత చింతపండు , అర కట్ట కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అలాగే, తాలింపు కోసం అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ మినప్పప్పు నాలుగు ఎండుమిర్చి, రెండు కరివేపాకు ఆకులు

పొలం దొండకాయ పచ్చడి తయారీ విధానం: ముందుగా దొండకాయలను తీసుకుని వాటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని పాన్లో వేసి ఇంకా వాటితో పాటు నాలుగు పచ్చిమిర్చి, దొండకాయ ముక్కలను కూడా వేసి రంగు మారే వరకు వీటిని బాగా వేయించాలి. ఇలా చేస్తే పచ్చడి మెత్తగా తినొచ్చు

ఇక ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కొంచం చింతపండు, నాలుగు వెల్లుల్లి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు కూడా వేసి వీటిని మిక్సీలో మెత్తగా.. గరుకుగా రుబ్బుకోవాలి. ఇక ఇప్పుడు చిన్న పాన్లో పోపు సిద్ధం చేసి ఈ పచ్చడి మీద పోయాలి. అలాగే, చివర్లో కొత్తిమీర కూడా చల్లి దీనిని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.

రాగి సంగటి, జొన్న రొట్టెల్లోకి సూపర్: ఇంకా దీనిని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ పచ్చడిని రాగి సంగటి, జొన్న రొట్టె, చపాతీలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దీ నిముషాల్లోనే ఇది తయారవుతుంది. ఇది పల్లెటూరి రుచిని కూడా అందిస్తుంది. ఇంకా దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది.