
మనలో చాలా మందికి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తీ పెంచుకోవడం కోసం మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి వాళ్లు ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు చేసి తింటే రుచి అదిరిపోతోంది. ఎలా చెయ్యాలో ఇక్కడ చూద్దాం..

కావాల్సిన పదార్దాలు: 5 ఉసిరికాయ, 10 పచ్చిమిర్చి, కంది పప్పు, రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ కారం,అర టీ స్పూన్ పసుపు ,రెండు కప్పులు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు టమాటాలు, నూనెను తీసుకోవాలి. దీనిని వేడి వేడి అన్నంతో తింటే రుచి సూపర్ గా ఉంటుంది.

ముందుగా పప్పును బాగా ఉడకబెట్టి దానిలో దానిలో ఉసిరికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, ఒక గ్లాస్ నీళ్లు పోసి పది నుంచి 15 నిమిషాల పాటు ఉడికించి, దానిని కిందకు దించి పప్పు గుత్తితో మెదుపుకోవాలి.

ఆ తర్వాత గ్యాస్ వెలిగించి ఆయిల్ చేసి, దానిలో అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, 10 కరివేపాకు ఆకులు, కొంచం ఇంగువ వేసి బాగా వేయించాలి దీనిని తీసుకుని పప్పులో వేసి బాగా కలుపుకోవాలి.

అంతే, వేడి వేడి ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు రెడీ. అయితే, ఉసిరి ముక్కలను కంది పప్పుతో బాగా ఉడికిస్తే రుచిగా ఉంటుంది. ఇమ్యూనిటీని తక్కువ ఉన్నవాళ్లు ఈ పప్పును వారంలో రెండు సార్లు తీసుకుంటే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.