
ప్రస్తుతం ఎక్కువగా తులసి సీడ్స్ తీసుకుంటున్నారు. ప్రతి రోజూ ఉదయం పాలలో తులసి గింజలు కలిపి తింటే బరువు తగ్గుతారు. అంతేకాదు ఒక గ్లాసు నీటిలో ఈ సీడ్స్ తీసుకుని అందులో కాస్త నిమ్మరసం కలపాలి. ఒక గ్లాస్ నీటిని ఉదయం అల్పాహారం తీసుకునే ముందు తాగడం వలన బరువు తగ్గుతారు.

కూరగాయల విత్తనాల వలెనే తులసి గింజల్లో కూడా చాలా ప్రయోజనాలున్నాయి. ఈ విత్తనాల్లో అనేక ఆరోగ్యకరమైన పోషకాలున్నాయి. శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలను కలిగి ఉన్నాయి. అంతేకాదు శరీరాన్ని షేప్లో ఉంచడానికి కూడా ఇవి సహాయపడతాయి.

ఇప్పటికీ చాలా మంది జలుబు, దగ్గు వచ్చినప్పుడు తులసి ఆకులను తింటారు. తులసి ఆకుల్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోండి. ఇప్పుడు ఒక చెంచా తేనెలో కొన్ని తులసి ఆకులను నమలండి. ఇలా చేయడం వలన అనేక సమస్యలను పరిష్కరిస్తాయి.

తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తినండి. ఈ నీరుని తల పట్టుకోవడం వల్ల కలిగే సమస్యను నయం చేస్తుంది. అనేకాదు కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలంటే నీటిలో తులసి ఆకులను మరిగించి తినండి. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం. బరువు తగ్గడానికి ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి. ఈ విత్తనాలను తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచిది

తులసి గింజలు చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది జీర్ణం అవడం సులభం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ తులసి లేదా సబ్జా గింజ కూడా మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందేందుకు బాగా పనిచేస్తాయి.

తులసి గింజలను క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మహిళలకు కూడా చాలా మంచిది. ఒక నెల మొత్తం ఈ తులసి గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే పీరియడ్స్ సమస్య ఉండదు. కడుపు నొప్పి ఉండదు. ఈ విత్తనాలను ఉదయం 20 నిమిషాలు నీటిలో నానబెట్టండి. అప్పుడు తినండి.