
రోజ్ వాటర్: గులాబీ ఆకులతో తయారుచేసిన రోజ్ వాటర్ చర్మాన్ని చాలా కాలం పాటు హైడ్రేట్గా ఉంచుతుంది. మార్కెట్లో రోజ్ వాటర్ సులభంగా లభిస్తుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత, రాత్రి నిద్రపోయే ముందు ఈ ఫేస్ మిస్ట్ని చర్మంపై అప్లై చేయండి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా వాడటం మంచిది.

అలోవెరా: మీరు కలబంద నుంచి కూడా ఫేస్ మిస్ట్ను సిద్ధం చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని బ్యాక్టీరియా, అలెర్జీల నుంచి రక్షిస్తుంది. ఇది చర్మాన్ని తక్షణమే రీహైడ్రేట్ చేయగలదు. ఇందుకోసం రోజ్ వాటర్లో మెత్తని అలోవెరా జెల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేస్తే మీ చర్మం తాజాగా ఉంటుంది.

చెర్రీ వాటర్: చర్మాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు ఇందులో ఉండే సహజసిద్ధమైన రంగు లోపలి నుంచి మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు, ఉదయం లేచిన తర్వాత దీన్ని వాడండి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే తేడాను గమనించవచ్చు.

కీర దోస రసం: నీరు పుష్కలంగా ఉన్న కీర దోసకాయ చర్మ సంరక్షణలో కూడా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. దీని ఫేస్ మిస్ట్ సిద్ధం చేయడానికి మీరు దోసకాయను తురుముకోవాలి. ఆ తర్వాత దాని రసాన్ని తీసి దూదితో ముఖం మీద అప్లై చేయాలి.

గ్రీన్ టీ: దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది పోషణతో పాటు చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. ఒక పాత్రలో నీళ్లు తీసుకుని అందులో గ్రీన్ టీ వేసి మరిగించాలి. ఈ నీరు చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్లో వేసి ముఖానికి పట్టించాలి.

సమ్మర్లో ఈ ఫేస్ మిస్ట్లు అద్భుతంగా పనిచేస్తాయి.