
వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందాలని ప్రజలు కోరుతున్నారు. భారతదేశంలో రుతుపవనాలతో ఆహ్లాదాన్ని కలిగించే అనేక నేక రాష్ట్రాలు ఉన్నాయి. ప్రకృతి అందంతో పాటు ప్రశాంతంగా ఉండే ప్రదేశాల గురించి తెలుసుకోండి.

అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో వర్షాకాలంలో ప్రకృతి అందాలు మరింత పెరుగుతాయి. ఇక్కడి జలపాతాలు, సరస్సుల దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తాయి.

అసోం: వర్షాలు కురుస్తున్న సమయంలో కొండ ప్రాంతాల్లో షికారు అద్భుతమైన అనుభవం. ఈ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో అందమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి.

మహారాష్ట్ర: మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కోసారి ఇక్కడ రికార్డు స్థాయి వర్షాలు కురుస్తాయి. వర్షాకాలంలో ఇక్కడ అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. అందమైన ప్రకృతి దృశ్యాలను వీక్షిస్తూ.. ఆ క్షణాలను ఆస్వాదించవచ్చు.

గోవా: విహారయాత్ర ప్రస్తావన వస్తే ముందుగా అందరి మదికి తట్టేది.. గోవా. సముద్రతీరం, భిన్నమైన వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంది. వర్షాల సమయంలో బీచ్ లో నడవడం మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఈ సీజన్ లో కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన ప్రాంతం.

వేసవి నుంచి ఉపశమనం లభించింది. సరదాగా విహారయాత్రకు వెళ్లాలని భావిస్తే.. ఈ రాష్ట్రాలు బెస్ట్ ఎంపిక