
అలాగే మామిడి, నిమ్మ, జామ వంటి పండ్లను క్రమం తప్పకుండా తినడం అలవాటు చేసుకోవాలి. జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం, ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ను పెంచుతుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయాన్నే కొన్ని జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, కనీసం 4-5 ఖర్జూరాలు తప్పక తినాలి.

ప్రతి రాత్రి రెండు ఖర్జూరాలను నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ ఖర్జూరాలు తినాలి. ఇది శరీరంలోని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అలాగే పొట్ట కూడా శుభ్రంగా ఉంటుంది. గ్యాస్-అసిడిటీ వంటి కడుపు సమస్యలే కాదు, ఈ డ్రై ఫ్రూట్ బహుళ శారీరక విధుల్లో చాలా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది.

మీరు చక్కెరకు బదులు స్వీట్ ఐటెమ్స్లో ఖర్జూరం పేస్ట్ని వాడుకోవచ్చు. దీని వల్ల ఆరోగ్యమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. జ్యూస్లు, పాలు, తీపి వంటకాల్లో ఈ ఖర్జూరాలను ఉపయోగించుకోవచ్చు. ఖర్జూరాలను నేరుగా తినడం ఇష్ట పడని వారు వీటిని.. వీటితో స్వీట్స్ కూడా తయారు చేసుకోవచ్చు.

నేటి కాలంలో గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు సర్వ సాధారణం అయ్యాయి. ఈ సమస్యలన్నింటిని ఇంటి నుంచే నివారణ పొందవచ్చు. ముందుగా యాంటాసిడ్లను తీసుకోవడం మానుకోవాలి. అసిడిటీని సులభంగా వదిలించుకోవడానికి ప్రతిరోజూ ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాలి.

మన శరీరంలోని సమస్యలన్నీ పోషకాహార లోపం వల్ల ఏర్పడతాయి. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్లనే అనేక సమస్యలు తలెత్తుతాయి. ఆహారం అజీర్ణం, ఊబకాయం, నిద్రలేమితో పాటు గ్యాస్-గుండె మంట వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.