ప్రస్తుతం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ రేటు నానాటికీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇటీవలి అధ్యయనాల ప్రకారం క్యాన్సర్ సంభవం రేటు 50 ఏళ్లలోపు వారిలోనే ఎక్కువగా ఉందట. క్యాన్సర్ రేట్లు పెరగడానికి వాయుకాలుష్యం ఒక కారణమైనమైతే.. ప్రస్తుత జీవనశైలి కూడా మరో కారణం. అంటే మితిమీరిన జంక్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్, నిద్రలేమి, మితిమీరిన ఒత్తిడి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది.
దీంతో అధికంగా క్యాన్సర్ క్రిములు శరీరంలో గూడు కట్టుకుంటున్నాయి. తొలినాళ్లలో దీనిని గుర్తించడంతో ఆలస్యం అవుతుండటంతో ప్రమాదం మరింత పెరుగుతుంది. సకాలంలో చికిత్స ప్రారంభించడానికి క్యాన్సర్ లక్షణాలను తెలుసుకోవడం చాలా అవసరం.
క్యాన్సర్ క్రిములు శరీరంలో గూడు కట్టుకున్నప్పుడు ఈ కింది 5 లక్షణాలలో ఏదైనా ఒకటి కనిపించవచ్చు. ఈ లక్షణాలు కనిపించిన వెంనటే నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. చాలా మంది రక్తహీనతతో బాధపడుతుంటారు. అయితే, హిమోగ్లోబిన్ స్థాయి చాలా తక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది క్యాన్సర్ సంకేతం కావచ్చు.
దగ్గు సమయంలో రక్తస్రావం, మూత్రంలో రక్తం, రొమ్ము వాపు, గొంతు నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది, రుతువిరతి తర్వాత రక్తస్రావం కావడం వంటివి క్యాన్సర్ లక్షణాలలో ఒకటి. ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి తనిఖీ చేయించుకోవాలి.
ఏదైనా క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి తనిఖీ చేయండి. అప్పుడు క్యాన్సర్ను మొదట్లోనే గుర్తించి ముందస్తు చికిత్స ద్వారా నివారించడం సాధ్యమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రపంచంలో 200 రకాల క్యాన్సర్లు ఉన్నాయట. అయితే క్యాన్సర్ను ముందుగానే గుర్తించి చికిత్స ప్రారంభించినట్లయితే, వ్యాధిని చాలా వరకు నయం చేయవచ్చు.