
వాష్ రూమ్ అంటే ఎవరికీ పెద్దగా నచ్చదు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుందని అందరూ అనుకుంటారు. శుభ్రంగా క్లీన్ చేస్తే అక్కడ బ్యాక్టీరియాలు చాలా తక్కువగానే ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాత్రూమ్ కంటే ఎక్కువ క్రిములు ఉండేది ఈ ప్రదేశాల్లోనేనట.

ఈ మధ్య కాలంలో వ్యాధులు ఎక్కువ అవడానికి ముఖ్య కారణం చేతులు శుభ్రంగా కడుక్కోవపోవడమే. టాయిలెట్ సీట్ కంటే.. ఎక్కువగా మీరు ఉపయోగించే కంప్యూటర్ కీబోర్డు మీదనే ఉంటాయి. కాబట్టి దీన్ని ఎప్పుడూ క్లీన్గా శుభ్రం చేసుకోవడం ముఖ్యం.

కరెన్సీ నోట్ల మీద కూడా క్రిములు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు ఎప్పుడూ ఎక్కువగా ఉపయోగించే సెల్ ఫోన్ మీద కూడా ఉంటాయి. అందుకే ఎప్పుడైనా ఆహారం తిన్నప్పుడు చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకోవడం ముఖ్యం. ఏముందిలే అని వాటిని టచ్ చేసి తింటే.. రోగాలను కోరి ఆహ్వానించినట్టే.

అలాగే మీరు కూర్చునే కుర్చీలు, కాఫీ కప్స్, రెస్టారెంట్స్, హోట్సల్స్, నేరుగా వాతావరణానికి ఎక్స్ పోజ్ అయ్యే ఆహారాలపై క్రిముల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. స్విమ్మింగ్ ఫూల్స్లో కూడా బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. కింద పడ్డ ఆహారాన్ని కూడా తినకూడదు.

క్రెడిట్, డెబిట్ కార్డ్స్, ఏటీఎం మిషీన్స్, కంప్యూటర్ స్క్రీన్స్, థియేటర్స్ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా బ్యాక్టీరియాలు ఉండొచ్చు. కాబట్టి మీరు శుభ్రత పాటించడం ముఖ్యం. ఎప్పటికప్పుడు చేతులు కడుగుతూ ఉండాలి. శానిటైజర్తో మీ వస్తువులు శుభ్రం చేసుకోవాలి.