
తొమ్మిది గ్రహాల్లో శని గ్రహానికి చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం 2025 మే 26న కుంభ రాశిలో నుంచి మీన రాశిలోకి ప్రవేశించనుంది. అంతే కాకుండా ఆ రాశిలో ఇప్పటి వరకు బుధుడు సంచరిస్తున్నాడు. దీంతో శని, బుధ గ్రహాల కలయిక ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది.

సింహ రాశి : బుధ, శని గ్రహాల కలయిక వలన ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశిలోని వారు అత్యధిక లాభాలు పొందుతారు. అంతే కాకుండా అమ్మకాలు పెరుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా మీకు మంచి రాబడి రావడం ఖాయం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

మకర రాశి : మకర రాశి వారిపై శని బుధుల కలయిక సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీని వలన ఈ రాశి వారికి వ్యాపారం బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు జాబ్ కొడుతారు.

మేష రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని సంచారం వలన వీరికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. సంపద రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్త వరనరుల నుంచి డబ్బు సంపాదిస్తారు.

కుంభ రాశి : రాజయోగం వలన కుంభరాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. వీరి ఆస్తులు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారు మీ పై ఉన్నవారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.