
భారతదేశం అంటే ఇష్టపడని వాళ్లు దాదాపు ఉండరు. ప్రపంచ దేశాల్లో భారత్ అన్న.. భారత దేశ సంస్క్రతి ఆచార వగయవహారాలన్న.. మన పల్లెటూర్లన్న తెగ ఇష్టపడుతారు విదేశీయులు. భారత దేశంలో గడపాలని కొందరు కోరుకుంటే ఇక్కడికి కోడలుగా రావాలని మరికొందరు సంబరపడుతారు.

అలాంటి ఓ ఆస్ట్రేలియా అమ్మాయి కథే ఇది. తెలంగాణలోని నిర్మల్కు చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లాడి తెలుగింటి కోడలుగా అడుగు పెట్టింది ఓ ఆస్ట్రేలియా అమ్మాయి.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రి నగర్ కాలనీకి చెందిన సదానందం పద్మ దంపతుల కుమారుడు కార్తీక్ చదువుల నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. అక్కడ హనా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కార్తీక్ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేయగా, హనా సైంటిస్టుగా పనిచేస్తుంది.

వీరి మధ్య పరిచయం ఏర్పడి ఒకరికొకరు ఇష్టాన్ని ఏర్పరచుకొని తీరా పెద్దవాళ్లను ఓప్పించి నేడు నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిటీ ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో వేద పండితులు మంత్రోత్సవాలు నడుమ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

భారతదేశపు సంస్కృతి సంప్రదాయాలంటే నాకెంతో ఇష్టమని పెళ్లికూతురు పేర్కొంది.