
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ చిన్నపాటి ఘర్షణలు మినహా సజావుగా సాగుతున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ పోలింగ్లో సెలబ్రేటీలు, రాజకీయ ప్రముఖులు తమతమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి సిద్దిపేట జిల్లా చింతమడకకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేసేందుకు చింతమడక వచ్చిన సీఎం కేసీఆర్

చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు వేశాక వేలిని చూపుతున్న దృశ్యం

ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు వేశాక ఓటర్లకు నమస్కారం చేస్తూ వెళ్లిపోతున్న దృశ్యం. ఆయనతో పాటు మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు.

ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత వేలిని ఓటర్లకు చూపిస్తున్న కేసీఆర్