
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమీ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేస్తోంది. షావోమీ సీవీ పేరుతో రానున్న ఈ ఫోన్లో అదిరిపోయే ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

చైనాలో మరికాసేపట్లో విడుదల కానున్న ఈ ఫోన్ను త్వరలోనే భారత్లోనూ విడుదల చేయనున్నారు. ఇక విడుదలకు ముందే షావోమీ ఈ ఫోన్ ఫీచర్లను ప్రకటించింది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. అక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778జీ ఎస్వోసీ ప్రాసెసర్తో నడిచే ఈ ఫోన్లో ట్రిపుల్ రేర్ కెమెరాను అందించారు.

కర్వ్డ్ డిస్ప్లేతోపాటు 4500 ఎంఏహెచ్ బ్యాటరీ డ్యుయల్ సాఫ్ట్ లైట్ ఎల్ఈడీ ఫ్లాష్, ఆటోఫోకస్ లెన్స్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, లౌడ్ స్పీకర్ గ్రిల్లె వంటి ఫీచర్లు ఈ ఫోన్ సొంతం.

ఇక కెమెరా విషయానికొస్తే 32 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. దీంతో పాటు ప్రైమరీ మైక్రోఫోన్, సిమ్ కార్డ్ స్లాట్, ఇన్ఫ్రారెడ్(ఐఆర్) సెన్సార్ లాంటి ఫీచర్లు అందించారు.