సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ తాజాగా బడ్జెట్ రేంజ్లో స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది. సామ్సంగ్ గ్యాలక్సీ ఎమ్04 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ తక్కువ ధరలో అందుబాటులో ఉంది.
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేస్తుంది. రేండేళ్ల పాటు ఆండ్రాయిడ్ సపోర్ట్ అందించే క్రమంలో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ వరకు అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించారు.
మీడియా టెక్ హీలియో పీ35 చిప్సెట్తో పనిచేసే ఈ ఫోన్లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 15 డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్తో కూడిన 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
డిసెంబర్ 16వ తేదీ నుంచి మార్కెట్లోకి విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 8000కు అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్లో 6.5 ఇంచెస్ ఫుల్హెచ్డీ+ఎల్సీడీ డిస్ప్లేను అందించారు.
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ఫోన్లో 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. బయోమెట్రిక్ సపోర్ట్తో పనిచేసే ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్ కలర్స్లో అందుబాటులోకి రానున్నాయి.