
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. గ్యాలక్సీ ఎమ్14 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ 5జీ నెట్వర్క్కి సపోర్ట్ చేస్తోంది. దేశంలో 5జీ సేవలు విస్తరిస్తున్న తరుణంలో బడ్జెట్లో 5జీ ఫోన్ను తీసుకొచ్చింది సామ్సంగ్.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ఫోన్లో 6.6 ఇంచెస్ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ ఫోన్లో క్జినాస్ 1330 ఆక్టా-కోర్ ఎస్ఓసీ ప్రాసెసర్ను అందించారు.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఈ స్మార్ట్ఫోన్లో 25 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ చేసే 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఫింగర్ ప్రింట్ స్కానర్కు సైడ్లో ఇచ్చారు. ఇప్పటికే లాంచ్ అయిన ఈ ఫోన్ సేల్ ఏప్రిల్ 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదటి ప్రారంభంకానుంది.

ధర విషయానికొస్తే 4GB RAM+128GB వేరియంట్ ధర రూ. 13,490, 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 14,990గా ఉంది. బ్లూ, డార్క్ బ్లూ, సిల్వర్ కలర్లో అందుబాటులో ఉంది.