చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్మీ మార్కెట్లోకి కొత్త ఫోన్ను తీసుకొస్తోంది. రెడ్మీ ఏ3ఎక్స్ పేరుతో ఈ ఫోన్ను లాంచ్ చేయనున్నారు. మొదటగ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ చేయనున్న ఈ ఫోన్ను భారత మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇక రెడ్మీ ఏ3 ఎక్స్ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.71 ఇంచెస్తో కూడిన హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్ను ఇవ్వనున్నారు. యూనిసోక్ టీ603 ప్రాసెసర్తో ఈ ఫోన్ పనచేస్తుంది. ఈ ఫోన్ను అరోరా గ్రీన్, మిడ్నైట్ బ్లాక్, మిడ్ నైట్ వైట్ కలర్స్లో తీసుకురానున్నారు.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 8 మెగా పిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 5,700గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్లో 4జీబీ ర్యామ్తో తీసుకొస్తున్నారు. అయితే వర్చువల్గా ఎస్డీ కార్డు ద్వారా 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇంటర్నల్ మెమోరీని కూడా మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్స్ను అందించారు. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఆధారిత ఫేక్ అన్ లాక్ ఫీచర్కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.