చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. రియల్మీ జీటీ నియో 3టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో విడుదల కాగా సెప్టెంబర్ 23 నుంచి భారత్లో అందుబాటులోకి రానుంది.
మూడు వేరియంట్లలో రానున్న ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ.29,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.31,999. 8జీబీ ర్యామ్ + 256జీబీ ధర రూ.33,999. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో భాగంగా రూ. 7 వేలు డిస్కౌంట్ లభించనుంది.
ఇక ఈ ఫోన్ పీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్లో 120hz రిఫ్రెష్ రేట్తో కూడిన 6.62 అంగుళాల ఈ4 అమొలెడ్ డిస్ప్లేను అందించారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో పనిచేస్తుంది.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ స్మార్ట్ఫోన్లో 80 వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. 12 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ కావడం ఈ ఫోన్ ప్రత్యేకత.
కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.