ప్రస్తుతం మార్కెట్లో 5జీ ఆధారిత ఫోన్లు సందడి చేస్తున్నాయి. భారత్లో మరికొన్ని రోజుల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో కంపెనీలు ఫోన్లను విడుదల చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఇటీవల వరుస 5జీ ఫోన్లను లాంచ్ చేస్తున్న రియల్మీ తాజాగా క్యూ5 పేరుతో మరో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ను త్వరలోనే భారత్లో లాంచ్ చేయనున్నారు.
రియల్మీ క్యూ5 ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇందులో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్గా అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇచ్చారు.
క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్పై ఈ ఫోన్ చేసే ఈ ఫోన్లో 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
ఇక ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.16,600, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.18,900, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.21,200 ఉండనుంది.