చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను తీసుకొచ్చే పనిలో పడింది. పోకో ఎఫ్6 పేరుతో ఈ ఫోన్ను తీసుకొస్తున్నారు. కాగా చైనాలో గతేడాది లాంచ్ అయిన రెడ్మీ టర్బో3కి పోకో ఎఫ్6 రీబ్రాండెడ్ ఫోన్గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్ను మే23వ తేదీన భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కంపెనీ ఈ 5జీ ఫోన్కు సంబంధించిన టీజర్ను విడుదల చేశారు. ఈ ఫోన్లో క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ను అందించనున్నారు.
పోకో ఎఫ్6 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో రెండు కెమెరాలతో కూడిన రెయిర్ కెమెరా సెటప్ను అందించారు. రింగ్ తరహాలో కనిపించే ఫ్లాష్ను అందింఆచరు. 50 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ సొంతం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఇక ఇందులో 6.7 ఇంచెస్తో కూడిన 120 హెర్ట్జ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లేను ఇవ్వనున్నారని సమాచారం. కార్నింగ్ గొరిలా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో ఇవ్వనున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ ధర 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 23,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 90 వాట్స్ బ్యాటరీని అందించారు.