
భారత్లో మరికొన్ని రోజుల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో స్మార్ట్ఫోన్ కంపెనీలు కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒప్పో మరో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది.

ఒప్పో కే సిరీస్లో భాగంగా ఒప్పో కే10 5జీ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేస్తోంది. జూన్ 8వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభంకానుంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..

ఈ స్మార్ట్ఫోన్ 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్తో తీసుకొచ్చారు. ఫోన్ బ్లూ, బ్లాక్ కలర్స్లో అందుబాటులోకి రానుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ఫోన్లో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ స్మార్ట్ఫోన్లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ ఫోన్ ధర రూ. 14,999కి అందుబాటులో ఉండనుంది.