ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ తాజాగా భారత మార్కెట్లోకి వన్ ప్లస్ 10 ప్రో పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. ప్రీమియం రేంజ్లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్లో హైఎండ్ ఫీచర్లను అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచెస్ క్యూహెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో స్నాప్డ్రాగన్ 8 జనరేషన్-1 5జీ ప్రాసెసర్ను అందించారు.
ఇందులో బ్యాటరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 80 వాట్స్ సూపర్ వూక్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీంతో ఈ ఫోన్ కేవలం 15 నిమిషాల్లోనే 70 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని వన్ప్లస్ చెబుతోంది.
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. వీడియో రికార్డింగ్ కోసం మూవీ మోడ్ అనే ఫీచర్ను అందించారు.
ఈ 5జీ స్మార్ట్ ఫోన్ను రెండు వేరియంట్లలో విడుదల చేశారు. ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ ధర రూ. 66,999 కాగా, 12 జీబీ+256 జీబీ ధర రూ. 71,999గా ఉంది. ఏప్రిల్ 5 నుంచి అందుబాటులోకి రానున్నాయి.