
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ప్లస్ నార్డ్ సిరీస్లో భాగంగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. వన్ప్లస్ నార్డ్ 2టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం యూరప్లో విడుదల చేశారు. త్వరలోనే భారత్లోకి అందుబాటులోకి రానుంది.

యూరప్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర 399 యూరోలుగా ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ. 32,100గా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్లో 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ప్యానెల్ ఇచ్చారు. మీడియా టెక్ డైమిన్సిటీ 1300 ఎస్ఓసీ ప్రాసెసర్తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

వన్ప్లస్ నార్డ్ 2టీలో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.