
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షియోమీ స్మార్ట్ ఫోన్లతో పాటు పలు ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్లతో మార్కెట్ను శాషిస్తోన్న విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు దాదాపు అన్ని రకాల గ్యాడ్జెట్లను విడుదల చేసిన ఈ కంపెనీ తాజాగా నోట్ బుక్స్ను కూడా తీసుకొచ్చే వనిలో పడింది. ఎంఐ నోట్బుక్స్ సిరీస్ను భారత్లో లాంచ్ చేయనుంది.

ఈ నోట్బుక్ను ఎంఐ ఆగస్టు 26న అధికారికంగా ప్రకటించనుంది. ఇదిలా ఉంటే తాజాగా అమెజాన్ ఈ నోట్బుక్ ఫీచర్ల గురించి కొన్ని లీక్లు ఇచ్చింది.

వాటి ప్రకారం.. ఎంఐ నోట్బుక్ 16:10 సైజ్ డిస్ప్లేతో రానుంది. ఇక ఎంఐ ఈ నోట్బుక్స్లో డిస్ప్లేకు ప్రాధాన్యత ఇవ్వనుంది. 3020X2000 రిసొల్యూషన్తో వచ్చే అవకాశం ఉంది.

అంతేకాకుండా సెక్యూరిటీ ప్రాయారిటీ ఇస్తూ.. ఫింగర్ప్రింట్ సెన్సార్ను ఎంబేడ్ చేసిన పవర్బటన్తోపాటు బ్యాక్లిట్ కీబోర్డ్ ఫీచర్తో రానుంది.

ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఎమ్ ఈ నోట్బుక్ను మ్యాక్బుక్ డిజైన్ మాదిరిగా డిజైన్ చేయనుందని సమాచారం.