
చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ఎమ్ఐ. సరికొత్త ప్రొడెక్ట్స్తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

స్మార్ట్ ఫోన్ల నుంచి స్మార్ట్ టీవీల వరకు రకరకాల గ్యాడ్జెట్స్ను తక్కువ ధరకే అందిస్తూ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుపుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా 'MI ఫ్యాన్ ఫెస్టివల్ 2021' పేరుతో ఓ సేల్ను నిర్వహిస్తోంది. ఆరు రోజుల పాటు జరిగే ఈ సేల్ నేడు (మార్చి 8) ప్రారంభమైన ఏప్రిల్ 13తో ముగియనుంది.

ఇందులో భాగంగా యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిడ్ కార్డులు, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల ఖాతాదారులకు పలు రకాల ఆఫర్లను అందిస్తోంది.

ఎమ్ఐకి చెందిన స్మార్ట్ఫోన్లు, స్మార్ట్టీవీలు, ల్యాప్టాప్లు, తదితర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.

ఇక ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ స్టోర్లలో కూడా ఆఫర్లతో కూడిన విక్రయాలు జరుపుతోంది ఎమ్ఐ.