భారత్కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా తన తొలి 5జీ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురానుంది. నవంబర్ 9న మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి ఈ ఫోన్ రానుంది.
ఇదిలా ఉంటే అధికారికంగా ఫోన్ను విడుదల చేయకముందే ఈ ఫోన్కు సంబంధించిన ఫీచర్లు కొన్ని ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ సమాచారం ప్రకారం ఈ ఫోన్లో పంచ్-హోల్ కటౌట్ డిస్ప్లేతో వస్తుంది.
ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G చిప్సెట్తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో 5,000mAh బ్యాటరీని ఇచ్చారు. ఇక ధర విషయానికొస్తే ఈ ఫోన్ రూ. 19,999 వద్ద లభించనున్నట్లు సమాచారం.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ ఫోన్లో 'గేమింగ్ మోడ్'ను ప్రత్యేకంగా అందించారు. ఇందులో లావా అగ్ని మీడియా టెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ను అందించారు.
కెమెరా విషయానికొస్తే.. 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ను కూడా అందించారు.