చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ ఐటెల్ తాజాగా భారత మార్కెట్లోకి తన మొట్ట మొదటి టాబ్లెట్ను లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్లో టాబ్లెట్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు.
ఐటెల్ పాడ్ వన్ పేరుతో తీసుకొచ్చిన ఈ టాబ్లెట్ ధర రూ. 12,999గా ఉంది. అన్ని ఆన్లైన్ సైట్స్తో పాటు ఆఫ్లైన్, రిటైల్ స్టోర్లోనూ అందుబాటులో ఉన్నాయి. లైట్ బ్లూ, డీప్ గ్రే కలర్ వేరియంట్లలో తీసుకొచ్చారు.
ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 10.1 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లేతో 1280x800 పిక్సెల్ల రిజల్యూషన్ కలిగి ఉంది. ఆక్టా-కోర్ SC9863A1 SoC ద్వారా పనిచేస్తుంది.
ఈ టాబ్లెట్లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ను అందించారు. స్టోరేజ్ను ఎక్ట్రనల్గా 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం అందించారు.
ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్)తో ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ టాబ్లెట్లో 8-మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇది USB టైప్-C పోర్ట్ ద్వారా 10W చార్జింగ్ సపోర్ట్తో 6,000mAh బ్యాటరీ ఉంది.