
స్మార్ట్ఫోన్ దిగ్గజ సంస్థ ఇన్ఫినిక్స్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. ఇన్ఫినిక్స్ జీటీ20పేరుతో తీసుకొస్తున్నీ ఫోన్ భారత్లో ఈనెల 21వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ను రూ. 25 వేలలోపు తీసుకొస్తున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లకు సంబంధించిన కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకనట చేయకపోయినప్పటికీ నెట్టింట్లో వీటికి సంబంధించిన కొన్ని లీక్లు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో లో 6.78 ఇంచెస్తో కూడిన అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించనున్నారు. 10-బిట్ ఎఫ్హెచ్డీ+ ఐ-కేర్, 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇవ్వనున్నారు. భారత్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ 4 ఎన్ఎమ్ ఆక్టాకోర్ ప్రాసెసర్తో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం.

ఈ ఫోన్లో గేమింగ్ అనుభవం కోసం మెరుగైన డిస్ప్లేను అందించడానికి ఎక్స్ 5 టర్బో చిప్ను అందించారు. ఇక యూజర్లకు మెరుగైన ఆడియో అనుభవాన్ని అందించడానికి ఇన్ఫీనిక్స్ జేబీఎల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫోన్ వేడి ఎక్కకుండా వీసీ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీని అందించనున్నారు.

ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ను అందించారు. ఇక 45 వాట్స్ సేఫ్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ధర విషయానికొస్తే ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో స్మార్ట్ ఫోన్ ధర రూ. 25,000లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.