స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ కారణంగా రోజుకో కంపెనీ అధునాతన ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే హాంగ్కాంగ్కు చెందిన టెక్నో బ్రాండ్ సరికొత్త స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది.
6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లేతో కూడిన ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిజల్యూషన్ 1,080x2,400 పిక్సెల్స్గా ఉంది.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ను అందించారు.
కెమెరా విషయానికొస్తే 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 48 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ముందువైపు రెండు కెమెరాలు ఉండడం ఈ ఫోన్ మరో ప్రత్యేకత.
4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ సొంతం. ఇక ఈ ఫోన్ ధరను కంపెనీ మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించనుంది.