
వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో ఫ్లిప్కార్ట్ తాజాగా బ్యాక్ టు కాలేజ్ పేరుతో సేల్ను ప్రారభించింది. ఈ సేల్లో భాగంగా పలు రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లను అందించింది.

సేల్లో భాగంగా జేబీఎల్, బోట్, రియల్మీతో పాటు ఇతర హెడ్ ఫోన్స్, స్పీకర్లపై 70 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది. అలాగే ట్రిమ్మర్లపై సేల్లో భాగంగా 60 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

ఇక విద్యార్థులకు ఉపయోగపడే ల్యాప్టాప్స్పై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. అలాగే కీబోర్డులు, మౌస్లు వంటి వాటిని రూ. 149 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు.

గేమింగ్ యాక్ససరీస్పై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. స్మార్ట్ వాచ్లపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.

ఈ ఆఫర్లతో పాటు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అప్పటికప్పుడు 10 శాతం అదనంగా డిస్కౌంట్ అందిస్తున్నారు.