
ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్లో వాట్సాప్లో మొదటి వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

అయితే ఇలాంటి పాపులర్ యాప్కి ఇటీవల ప్రైవసీ పాలసీతో కాస్త దెబ్బపడిందని చెప్పాలి. చాలా మంది ఈ యాప్ను డిలీట్ చేసుకొని ప్రత్నామ్నాయ యాప్లవైపు వెళ్లిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే మళ్లీ యూజర్లను తనవైపు తిప్పుకునే క్రమంలో వాట్సాప్ వరుసగా కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్.. 'మీడియా డిస్అప్పియరింగ్' అనే కొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. దీంతో ఫొటోలు/వీడియోలు అవతలి వ్యక్తి చూడగానే డిలీట్ అయిపోతాయి.

ఇందుకోసం ఫొటో/వీడియోను షేర్ చేసే ముందు, యాడ్ కాప్షన్ అనే బాక్స్ పక్కన ఉండే గడియారం సింబల్ను టచ్ చేసి యాక్టివేట్ సరిపోతుంది. ఆ తర్వాత మీరు పంపిన ఫొటో/వీడియోను అవతలి వ్యక్తి చూశాక డిలీట్ అయిపోతుంది.

ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.