
కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ భారత మార్కెట్ను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న చైనాకు చెందిన వివో కంపెనీ తాజాగా వివో వై53ఎస్ పేరుతో మరో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది.

వివో ఈ ఫోన్ను రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎం 51 వంటి స్మార్ట్ఫోన్లకు గట్టిపోటీని ఇచ్చేందుకు రూపొందించింది.

ఈ ఫోన్ ధరను రూ. 19,490గా నిర్ణయించారు. ఇక ప్రారంభ ఆఫర్లో భాగంగా హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్పై కొనుగోలు చేస్తే రూ. 1500 క్యాష్బ్యాక్ లభించనుంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్పై నడిచే ఈ ఫోన్లో 6.58-అంగుళాల ఫుల్-హెచ్డి+ డిస్ప్లేను అందించారు.

8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చిన ఈ ఫోన్లో మీడియాటెక్హెలియో జీ20 ప్రాసెసర్ను ఉపయోగించారు.

కెమెరా విషయానికొస్తే 64ఎమ్పీ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

బ్యాటరీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్లో 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడిన 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.