
అమెజాన్ సేల్లో భాగంగా సామ్సంగ్ గ్యాలక్సీ ఏ14 5జీ ఫోన్పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్పై సుమారు రూ. 7 వేల వరకు తగ్గింపు ధర లభిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత లాంటి వివరాలు మీకోసం.

సామ్సంగ్ గ్యాలక్సీ ఏ14 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.17,499కాగా అమెజాన్ సేల్లో భాగంగా 37 శాత డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ను రూ. 10,974కే సొంతం చేసుకోవచ్చు. అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. వెయ్యి వరకు డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఈ ఫోన్ను రూ. 10 వేలలోపే పొందొచ్చు.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. సామ్సంగ్ గ్యాలక్సీ ఏ14 స్మార్ట్ ఫోన్లో 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్తో కూడి రెయిర్ ట్రిపుల్ కెమెరా సెటప్ను అందించారు. ర్యామ్ను 8 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ ఫోన్లో 6.6 ఇంచెస్తో కూడిన ఫుల్హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. 1080 X 2408 రిజల్యూషన్తో సినిమాటిక్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ను పొందొచ్చు. ఈ ఫోన్పై కంపెనీ ఏడాది వారంటీని అందిస్తోంది.

ఇక బ్యాటరీ విషయనికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 5000 ఎమఏహెచ్ కెపాసిటీతో కూడిన శక్తివంతమైన బ్యాటరీని అందించారు. ఇక ఏఐ పవర్ మేనేజ్మెంట్ను ఇందులో ప్రత్యేకంగా అందించారు. 3.5 ఎమ్ఎమ్ ఆడియోజాక్ను ఇచ్చారు. బ్లూటూత్, వైఫై, యూఎస్బీ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.