
చాలా మంది వేసవి వచ్చిందంటే చాలు శీతల ప్రాంతాలకు టూర్లు వేసేందుకు ప్లాన్ వేస్తారు. ఏ ప్రదేశం మంచిదా? అని ఎదురు చూస్తుంటారు. మండుతున్న వేడి నుంచి ఉపశమనం పొందడానికి, కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన సమయం గడపడానికి దేశంలో చాలా టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. వేసవిలో ఏయే ప్రదేశాలను సందర్శించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

తవాంగ్: ఇది భారతదేశంలోని ఈశాన్య భాగంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్లోని ఒక చిన్న, చాలా అందమైన నగరం. వేసవి సెలవుల్లో మీరు తవాంగ్ వెళ్ళవచ్చు. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. తవాంగ్ మఠాలకు కూడా ప్రసిద్ధి. ఒకవేళ మీరు అక్కడికి వెళితే.. ఖచ్చితంగా ఈ మఠాలను సందర్శించాలి. వేసవిలో కూడా ఇక్కడ ఉష్ణోగ్రత 5°C నుండి 21°C వరకు ఉంటుంది.

తవాంగ్: ఇది భారతదేశంలోని ఈశాన్య భాగంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్లోని ఒక చిన్న, చాలా అందమైన నగరం. వేసవి సెలవుల్లో మీరు తవాంగ్ వెళ్ళవచ్చు. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. తవాంగ్ మఠాలకు కూడా ప్రసిద్ధి. ఒకవేళ మీరు అక్కడికి వెళితే.. ఖచ్చితంగా ఈ మఠాలను సందర్శించాలి. వేసవిలో కూడా ఇక్కడ ఉష్ణోగ్రత 5°C నుండి 21°C వరకు ఉంటుంది.

మున్నార్: వేసవి సెలవులను గడపడానికి ఇది చాలా అందమైన హిల్ స్టేషన్. మీరు ఇక్కడ ట్రెక్కింగ్, బైకింగ్ చేయవచ్చు. కార్మెల్గిరి ఎలిఫెంట్ పార్క్లో ఏనుగులను చూడవచ్చు. అందమైన దృశ్యాలను చూసి ఆనందించవచ్చు.

షిల్లాంగ్: వేసవి సెలవుల్లో మీరు షిల్లాంగ్ని కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన్ చెట్లు, అందమైన కొండలు, సాహస కార్యకలాపాలను ఆస్వాదించగలరు. ఇక్కడ ఎలిఫెంట్ ఫాల్స్, ఉమియం లేక్, పోలీస్ బజార్, షిల్లాంగ్ పీక్ మరియు డాన్ బాస్కో మ్యూజియం వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.