
దోహాలో జరిగిన ప్రపంచలో భారత టీటీ ఆటగాళ్లు దూకుడుమీదున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తొలి రౌండ్లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మణికా బాత్రా, సుతీర్తా ముఖర్జీ గెలుపొందారు. ఈ విజయంతో వీరిద్దరూ టోక్యో ఒలింపిక్స్ వైపు కదిలారు.

కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన మణికా 11-5, 11-7, 11-4, 11-0తో బల్గేరియాకు చెందిన మరియా యోవ్కోవాపై గెలిచింది.

సుర్తిత 11-3, 11-5, 11-7, 12-10తో ఇటలీకి చెందిన లిసా లంగ్ను ఓడించింది. ఇదిలావుండగా.. పురుషుల సింగిల్స్లో అచంతా శరత్ కమల్, జి సథియాన్ ఓడిపోయారు. ఇక 11-7, 11-6, 11-8, 11-5తో సథియాన్ను మిహై బోబోసికా ఓడించాడు.

నీగోల్ స్టోయనోవ్ నుండి 11-9, 6-11, 8-11, 4-11, 11-8, 10-12 ఓటమిని శరత్ అంగీకరించాల్సి వచ్చింది.