Sanjay Kasula |
Mar 10, 2021 | 12:53 AM
టీమిండియా ఉమెన్స్ క్రికెటర్ స్మృతి మంధాన.. తన పేరుతో సరికొత్త రికార్డును క్రియేట్ చేసుకున్నారు. ఛేదనల్లో వరుసగా పదోసారి హాఫ్ సెంచరీ + స్కోరును నమోదు చేసి కొత్త రికార్డులను సృష్టించారు.
పూనమ్ రౌత్ (62పరుగులకు తోడుగా మంధాన 80 పరుగులకు చెలరేగిన వేళ దక్షిణాఫ్రికాపై రెండో వన్డేలో మిథాలీ సేన 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
వన్డే కెరీర్లో 53 వన్డేలాడిన స్మృతి 44.14 సగటుతో 2119 పరుగులు చేసింది. 4 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు సాధించారు. ఇందులో 24 మ్యాచుల్లో టీమిండియా ఛేదనకు దిగింది.
అందులో 10 అర్ధశతకాలు వరుసగా సాధించడం ప్రత్యేకం.2018, మార్చి 15 నుంచి ప్రతి ఛేదనలోనూ ఆమె 50+ స్కోర్లు చేసింది.
దూకుడుగా ఆడే మంధాన వీటిలో 63.26 సగటుతో 1202 పరుగులు చేసింది. 2 సెంచరీలు, 12 అర్ధశతకాలు సాధించింది.
పురుషుల క్రికెట్లోనూ ఇలాంటి రికార్డు ఎవరికీ లేకపోవడం గమనార్హం. పాక్ దిగ్గజం జావెద్ మియాందాద్ వరుసగా 9 అర్ధశతకాలు చేశాడు.