
1.మిచిల్ మార్ష్: ఐపీఎల్ 2020లో ఆడిన ఒక్క మ్యాచ్లో పరుగులు ఏం చేయలేదు. అటు గాయాల బెడద. అందుకే ఈ ఏడాది ఇతడికి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు.

2. మహమ్మద్ నబీ: గతేడాది సీజన్లో మహమ్మద్ నబీ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. కాబట్టి ఈ సీజన్లో అతడి స్థానంలో మరొకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

3. ముజీబ్ ఉర్ రెహమాన్: ఈ ఏడాది ఆక్షన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తక్కువ ధరకు ముజీబ్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఆర్హెచ్కు రషీద్ ఖాన్ కీ బౌలర్.. కాబట్టి ముజీబ్కు అవకాశాలు తక్కువే.

4. జాసన్ హోల్డర్: డేవిడ్ వార్నర్, విలియమ్సన్, రషీద్ ఖాన్ వంటి స్టార్ విదేశీ ఆటగాళ్లు జట్టులో ఉండటం.. విజయ్ శంకర్ లాంటి ఆల్రౌండర్తో హోల్డర్కు చోటు దక్కడం డౌటే.