
కొవిడ్ నేపథ్యంలో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న భారత హాకీ జట్టు.. తొలి విజయం.

జర్మనీ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్ల టోర్నీలో తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టుపై 6-1 గోల్స్ తేడాతో ఇండియా గెలుపొందింది.

గోల్కీపర్ పీఆర్ శ్రేజేష్ జట్టుకు నేతృత్వం వహించాడు.

ఇండియా తరఫున నీలకంఠ శర్మ , వివేక్ సాగర్ ప్రసాద్ , లలిత్ కుమార్ ఉపాధ్యాయ , ఆకాశ్ దీప్ సింగ్ , హర్మన్ప్రీత్ సింగ్ లు గోల్స్ చేశారు.

మ్యాచ్ మార్చి 2న జర్మనీతోనే జరగనుంది. మార్చి 6,8 తేదీల్లో గ్రేట్ బ్రిటన్తో ఆడనుంది టీమిండియా.