
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తోంది. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలైన టీమిండియాకు తదుపరి మ్యాచ్ కీలకంగా మారింది. సీరిస్ గెలవాలంటే తప్పకుండా రెండో వన్డే మ్యాచ్ గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం ఢాకాలో మీడియాతో మాట్లాడతారు. బుధవారం జరగనున్న రెండో వన్డే గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు వెల్లడించే ఛాన్స్ ఉంది.

బుధవారం ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి వన్డే కూడా ఇక్కడే జరిగింది. ఉదయం 11:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. 11 గంటలకు టాస్ వేస్తారు.

రెండో వన్డే మ్యాచ్ను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు. సోనీ లైవ్ యాప్లోనూ వీక్షించవచ్చు. జియో టీవీ యాప్ ద్వారా సోనీ స్పోర్ట్స్ ఛానెల్ని చూడవచ్చు.

విరాట్ కోహ్లీ ప్రాక్టీస్లో బిజీగా గడుపుతున్నాడు. రెండో వన్డేలో మంచి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు మాజీ టీమిండియా సారధి.

బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమవడంతో భారత్ తొలి వన్డేలో ఓటమి చెందింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో 0-1 తేడాతో భారత్ వెనుకబడి ఉంది. మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తేనే సిరీస్ను గెలిచే ఛాన్స్ ఉంటుంది.

టీమ్ ఇండియా జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, కె.ఎల్. రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.