
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి రెండు సార్లు వివాహం జరిగే ఛాన్స్ ఉంటుందంట. ముఖ్యంగా జాతకంలో ఏడవ ఇల్లు, దాని అధిపతి అయిన శుక్రుడు రాహువు,గురుడు, శని, కేతువు గ్రహాలు వైవాహిక జీవితం పై ప్రభావం చూపుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మిథునం, తుల , ధనస్సు రాశి వారికి రెండు సార్లు వివాహం జరుగుతుంది అని చెబుతున్నారు పండితురు.

తుల రాశి : తుల రాశి వారికి శుక్రగ్రహం అధిపతి. ఈ రాశి వారికి ప్రేమ చాలా ఎక్కువ, అలాగే, వీరు అందానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా తన భాగస్వామి నుంచి ప్రేమను, అందాన్ని కూడా ఎక్కువగా ఆశిస్తారు. అయితే వారి అంచనాలు నెరవేరనప్పుడు వీరు మానసిక ఒత్తిడికి లోనై, మొదటి వివాహం తర్వాత మీ అంచనాలకు తగ్గట్టు రెండో వివాహం చేసుకుంటారు.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి రెండు సార్లు వివాహం జరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారు వివాహం తర్వాత మానసిక ఒత్తిడికి గురి అవ్వడం, అనేక ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉంటుందంట. అలాగే వీరు చాలా సవాళ్లను ఎదుర్కుంటారు. దీని కారణంగా ఈ రాశి వారు రెండు సార్లు వివాహం చేసుకునే ఛాన్స్ ఉంటుందంట.

మిథున రాశి : మిథున రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటారు. అంతే కాకుండా సంబంధాలపై కూడా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు కొన్ని సార్లు వీరి అంచనాలు నిజంకాకపోవడం,భాగస్వామి వారి అంచనాలకు సరితూగక పోవోడంతో వీరు మరో వివాహం చేసుకుంటారంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు