
వాస్తు శాస్త్రంలో తినడం, తాగేందుకు కూడా సరైన దిశను పేర్కొనబడింది. ఇది ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని వాస్తు నియమాలు పాటించాలి అనేది చాలా ముఖ్యం. ఇది చేయకపోతే ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఆహారం తినడానికి ఉత్తమమైన దిశను ఉత్తరం, తూర్పుగా పరిగణిస్తారు. ఈ దిశలో ఆహారం తీసుకోవడం ద్వారా పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి.

దక్షిణ దిక్కును యమ దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ దిక్కును ఆహారం తీసుకోవడానికి అత్యంత అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ దిశలో ఆహారం తీసుకోవడం వల్ల ఆయుష్షు తగ్గిపోయి దురదృష్టాన్ని ఆహ్వానిస్తుంది.

ఆహారం తినడానికి పశ్చిమ దిశ కూడా సరైనది కాదు. ఈ దిశలో ఆహారం తీసుకోవడం ద్వారా.. ఆ వ్యక్తి అప్పుల పాలవుతాడు. Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)